ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన గురించి గత కొన్ని రోజులుగా మీడియా , సోషల్ మీడియాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు . నా గెస్ట్ హౌస్ లో ఏలాంటి తనికీలు జరగలేదు . సోషల్ మీడియాలో వస్తున్నది తప్పు. నా గెస్ట్ హౌస్ లో , నా ఇంట్లో ఏలాంటి పోలీస్ తనికీలు జరగలేదు . కుట్ర పూరితంగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు .ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటాం . తప్పుడు కథనాలు రాసిన వారిపై లీగల్ గా .. నాయస్థానంలో కేసు వేయాలని నిర్ణయించాం. పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.