మంచిర్యాల జిల్లా లో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ సర్పంచ్

 మంచిర్యాల జిల్లా లో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ సర్పంచ్

జన్నారం, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కొత్తపేట గ్రామపంచాయితీ నుంచి సర్పంచ్​గా ఇటీవల గెలుపొందిన బీఆర్ఎస్ సీనియర్ నేత దినేశ్ నాయక్ బుధవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్ష్యంలో కాంగ్రెస్​లో చేరారు. పార్టీలో చేరిన దినేశ్​కు బొజ్జు కండువా కప్పి కాంగ్రెస్​లోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా దినేశ్ నాయక్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై కాంగ్రెస్​లో చేరానని, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యున్నతి కోసం పనిచేస్తానని తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ అలీఖాన్, కొత్తపేట కాంగ్రెస్ నేత గున్నాల ప్రసాద్ గౌడ్  తదితరులున్నారు.