ఉద్యమకారులను పక్కన పెట్టేందుకే బీఆర్ఎస్: మాజీ ఎంపీ రవీంద్రనాయక్

 ఉద్యమకారులను పక్కన పెట్టేందుకే బీఆర్ఎస్: మాజీ ఎంపీ రవీంద్రనాయక్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టేందుకే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారని మాజీ ఎంపీ, బీజేపీ నేత రవీంద్రనాయక్ ఆరోపించారు. అందుకే స్వరాష్ట్రం కోసం పోరాడిన వారి పేర్లను ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదని తెలిపారు. 

కవితను లిక్కర్ స్కాం నుంచి బయటపడేసేందుకు ఫాం హౌస్ ను తెర పైకి తెచ్చారని రవీంద్రనాయక్ విమర్శించారు. మిగులు బడ్జెట్ తో తెచ్చుకున్న ధనిక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్య రంగాలకు బడ్జెట్ లో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు.