- మైక్ ఇవ్వలేదని బీఆర్ఎస్ లీడర్లు వాకౌట్ చేయడం విడ్డూరం: మంత్రులు జూపల్లి, వాకిటి
- కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని వెల్లడి
హైదరాబాద్సిటీ, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి బయటపడుతుందన్న భయంతోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి పారిపోయారని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఆరోపించారు. కృష్ణా జలాలు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై సభలో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్పీకర్తమకు మైక్ ఇవ్వలేదన్న సాకు చూపించి బీఆర్ఎస్ నేతలు వాకౌట్చేయడం అంటే.. వారు పలాయనం చిత్తగించడమేనని ఎద్దేవా చేశారు.
శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు వీర్లశంకర్, మధుసూదన్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి వారు మాట్లాడారు. మూసీప్రక్షాళన ప్రాజెక్టుపై జరిగిన చర్చలో తమను మాట్లాడనివ్వలేదంటూ బీఆర్ఎస్డిప్యూటీ ఫ్లోర్లీడర్లు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, ఇతర ఎమ్మెల్యేలంతా సభనుంచి వాకౌట్ చేసి అసెంబ్లీ బయట ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి విమర్శంచారు.
మైక్ ఇవ్వలేదన్న ఒక్క సాకుతో మొత్తం సెషన్ను బాయికాట్చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆయా ప్రాజెక్టులపై బయట మాట్లాడేకంటే సభలో చర్చిద్దామని సీఎం చెప్పినా.. బీఆర్ఎస్ నేతలు కేవలం రాజకీయం చేస్తున్నారని జూపల్లి ఆరోపించారు. బీఆర్ఎస్నాయకులు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే మాత్రమే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు.
