
న్యూఢిల్లీ/ కోల్కతా: ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఓ బీఎస్ఎఫ్ జవాను తన సీనియర్ ఆఫీసర్ను కాల్చి చంపేశారు. శనివారం రాత్రి బెంగాల్ ముర్షీదాబాద్ జిల్లాలోని ధులియన్ బీఎస్ఎఫ్ క్యాంప్ లో ఈ ఘటన జరిగింది. ముర్షీదాబాద్లో ఇటీవల మత ఘర్షణలు చెలరేగడంతో ధులియన్ ప్రాంతంలో బీఎస్ఎఫ్ ఓ యూనిట్ను ఏర్పాటు చేసింది.
ఇందులో ఉన్న కానిస్టేబుల్ శివం కుమార్ మిశ్రా, సీనియర్ హెడ్ కానిస్టేబుల్ రతన్ సింగ్ షెకావత్ మధ్య ఓ విషయంపై శనివారం రాత్రి గొడవ జరిగింది. దీంతో శివం తన సర్వీస్ రైఫిల్తో రతన్ సింగ్ను కాల్చి చంపేశారు. నిందితుడైన కానిస్టేబుల్ శివంను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన వెనకున్న కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి బీఎస్ఎఫ్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించిందని చెప్పారు.