368 లీటర్ల కెపాసిటీ గల రిఫ్రిజిరేటర్ను బీఎస్హెచ్ హోమ్ అప్లియెన్సెస్ మార్కెట్లోకి తెచ్చింది. ఇండియాలో ఇంత పెద్ద రిఫ్రిజిరేటర్ రావడం ఇదే మొదటిసారి అని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా ఈ ఫ్రిజ్లో వాటర్ డిస్పెన్సర్ను కూడా అమర్చారు. కన్జూమర్ల కోసం 15 ఫీచర్లను అందిస్తున్నామని బీఎస్హెచ్ హోమ్ పేర్కొంది. ఈ రిఫ్రిజిరేటర్ను చెన్నై ప్లాంట్లో తయారు చేశామని తెలిపింది.
ఎంటీఆర్ నుంచి కొత్త సేమియా బ్రాండ్
కొత్త సేమియా బ్రాండ్ ‘వెర్మిసెల్లి డిలైట్’ను ఎంటీఆర్ సోమవారం లాంచ్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రజల ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రొడక్ట్ తీసుకొచ్చామని తెలిపింది. ఎంటీఆర్ వెర్మిసెల్లీ డిలైట్లో సేమియా ఒకదానికొకటి అతుక్కోదని, ముద్దలుగా మారదని కంపెనీ చెబుతోంది. లోకల్ కిరాణా షాపుల్లో కూడా ఇవి దొరుకుతాయని వెల్లడించింది.