ఇంత నిర్లక్ష్యమా? రాజ్యాంగ పీఠికను మార్చడంపై.. బీఎస్పీ చీఫ్ మాయావతి ఫైర్

ఇంత నిర్లక్ష్యమా? రాజ్యాంగ పీఠికను మార్చడంపై..  బీఎస్పీ చీఫ్ మాయావతి ఫైర్

హైదరాబాద్, వెలుగు: పదో తరగతి సోషల్ స్టడీస్ కవర్ పేజీలో రాజ్యాంగ పీఠికను మార్చడంపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. ‘ఇంత నిర్లక్ష్యమా’  అని రాష్ట్ర సర్కార్ పై ఆమె ఫైర్ అయ్యారు. ‘‘తెలంగాణలో 10వ తరగతి సోషల్ స్టడీస్ కవర్ పేజీపై ముద్రించిన రాజ్యాంగ పీఠికలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను తొలగించడం.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇలాంటి వాటిపై ప్రభుత్వం దృష్టిసారించాలి. పవిత్ర రాజ్యాంగాన్ని గౌరవించాలి” అని శనివారం ట్వీట్ చేశారు.