మంత్రుల కాన్వాయ్​లను అడ్డుకున్న బీఎస్పీ నాయకులు

మంత్రుల కాన్వాయ్​లను అడ్డుకున్న బీఎస్పీ నాయకులు

సిద్ధిపేట రూరల్, వెలుగు: సిద్దిపేటకు వచ్చిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కాన్వాయ్​లను సిద్దిపేట జిల్లా బీఎస్పీ నాయకులు గురువారం అడ్డుకొనేందుకు యత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఈ. ఆర్. మోహన్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు తెలియకుండా తమను అక్రమ అరెస్టులు చేస్తున్నారని, పోలీసులు ఈ తీరు మార్చుకోవాలని డిమాండ్​ చేశారు. ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెడితే.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను దాచిపెట్టలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షుడు కరుణాకర్, దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షుడు జింక సంజు, పొన్నాల నర్సింలు, ప్రవీణ్, నరేష్, రంగస్వామి, నాగరాజు   పాల్గొన్నారు.