గో కార్టింగ్‌ ప్లే జోన్‌లో ప్రమాదం: బిటెక్ విద్యార్ధిని మృతి

గో కార్టింగ్‌ ప్లే జోన్‌లో ప్రమాదం: బిటెక్ విద్యార్ధిని మృతి

హైదరాబాద్ శివారు గుర్రంగూడ గో కార్టింగ్ ప్లే జోన్ లో జరిగిన ప్రమాదంలో తీవ్రగాయాలైన ఓ యువతి చికిత్స పొందుతూ చనిపోయింది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న శ్రీ వర్షిని తన ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఎంజాయ్ చేసేందుకు వచ్చింది. ప్లే జోన్ లో ఉన్న కారులో రౌండ్స్ వేద్దామనుకున్నారు. ఓ యువకుడు కార్ డ్రైవింగ్ చేస్తుండగా శ్రీ వర్షిని పక్కనే కూర్చుంది.  అయితే కారు ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్‌లో శ్రీ వర్షిణికి తీవ్ర గాయాలయ్యాయి.  వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీ వర్షిణి మృతి చెందింది.

టైరులో శ్రీ వర్షిణి తల వెంట్రుకలు చిక్కుకుపోవడంతో తల బలంగా నేలకు తగిలిందని, ఆమె పెట్టుకున్నహెల్మెట్‌ కూడా పగిలిపోయి తలకు తీవ్రంగా గాయమైందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో గో కార్టింగ్ కు అనుమతి ఇవ్వడంపై  శ్రీ వర్షిణి తల్లిదండ్రులు మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.