న్యూఢిల్లీ: దేశంలో భూముల రిజిస్ట్రేషన్ ఇక సులభతరం కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ 2022లో నూతన భూ సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఒకే దేశం–ఒకే రిజిస్ట్రేషన్ కు సంబంధించిన విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ‘ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్’ సాఫ్ట్వేర్ నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(NGDRS)తో దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
'ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్' సాఫ్ట్వేర్తో నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్తో ఏకీకరణను అమలులోకి తీసుకోవడం, డీడ్స్, డాక్యుమెంట్లను ఎక్కడైనా ఏకరీతిగా నమోదు చేయడానికి ప్రోత్సహించబడుతుంది.
— PIB in Telangana ??#AmritMahotsav (@PIBHyderabad) February 1, 2022
- కేంద్రమంత్రి @nsitharaman #Budget2022 #AatmaNirbharBharatKaBudget pic.twitter.com/VbvRmJ8t71
దేశవ్యాప్తంగా డీడ్లు, రిజిస్ట్రేషన్లకు నూతన ఆధునిక వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. మెరుగైన జీవన సౌలభ్యం కోసం, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి వీలుగా వన్ నేషన్–వన్ రిజిస్ట్రేషన్ విధానం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటి కోసం కావాల్సిన సవరణలు చేస్తామన్నారు. నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పలు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైందన్నారు. అలాగే, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి 25 వేల ఒప్పందాలు తొలగించామని, 1,486 యూనియన్ చట్టాలనూ రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. చెల్లింపుల్లో జాప్యాన్ని తగ్గించడానికి ఆన్ లైన్ బిల్లు చెల్లింపు వ్యవస్థ గురించి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలతో మాట్లాడినట్లు నిర్మల పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం: