
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి పరిధిలోని మూసాపేట మెట్రో స్టేషన్లో బుల్లెట్ కలకలం సృష్టించింది. మూసాపేట పరిధిలోని ప్రగతినగర్లో ఉంటున్న బాలుడు(12) శనివారం రాత్రి మూసాపేట మెట్రో రైలు ఎక్కడానికి స్టేషన్కు వెళ్లాడు. మెట్రో రైల్ సిబ్బంది తనిఖీల్లో అతని జేబులో ఒక బుల్లెట్ లభించింది. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
విచారణలో బాలుడి సవతి తండ్రి మహ్మద్ ఆలం(28) వద్ద నుంచి బుల్లెట్ను బాలుడు తీసుకున్నట్టు తేలింది. బిహార్కు చెందిన ఆలం కొంతకాలంగా బాలుడి తల్లితో కలిసి ఉంటూ కూలి పని చేస్తున్నాడు. తన స్వరాష్ట్రం నుంచి బుల్లెట్తీసుకువచ్చినట్టు ఆలం అంగీకరించినట్టు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.