జూబ్లీహిల్స్, వెలుగు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో గురువారం చోరీ జరిగింది. నిందితులను వెస్ట్ బెంగాల్లో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్14లో భట్టి విక్రమార్కకు ఇల్లు ఉండగా, ఆయనకు ప్రజా భవన్లో అధికారిక నివాసాన్ని కేటాయించడంతో అక్కడే ఉంటున్నారు. బంజారాహిల్స్లోని ఇంట్లో పనివారితో పాటు వాచ్మెన్బిహార్కు చెందిన రోషన్ కుమార్ ఉంటున్నాడు.
భట్టి విక్రమార్క పీఎస్వో గా పనిచేస్తున్న భాస్కర్ శర్మ గురువారం ఉదయం సదరు వాచ్మెన్కు ఫోన్ చేయగా, లిఫ్ట్చేయలేదు. వేరే పనివారికి ఫోన్ చేయగా, ఇంట్లోని బెడ్రూమ్ తలుపుతోపాటు బీరువా కూడా బ్రేక్చేసి ఉందని చెప్పారు. దీంతో ఇంట్లోని రూ. 80 వేల నగదు, వెండి ఆభరణాలు పోయాయని బంజారాహిల్స్పోలీసులకు భాస్కర్ శర్మ ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు..ఖరగ్పూర్ రైల్వేస్టేషన్లో మండల్ కుమార్, అతడితో సంబంధమున్న ఉదయ్ కుమార్ ఠాకూర్ను అక్కడి రైల్వే పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు గ్రాముల బంగారం, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
