హైదరాబాద్, వెలుగు: రన్నింగ్ఆర్టీసీ బస్సులో గుండెపోటుకు గురైన ప్రయాణికుడికి డ్రైవర్, కండెక్టర్సీపీఆర్చేసి కాపాడారు. జీడిమెట్ల డిపోకు చెందిన 192/1 నంబర్బస్సు శుక్రవారం బాలానగర్ నుంచి బహదూర్పల్లి బయలుదేరింది. చింతల్ ఐడీపీల్ బస్ స్టాప్ మురళీకృష్ణ అనే ప్రయాణికుడికి గుండెపోటు గురయ్యాడు. కండక్టర్అంజలి గుర్తించి డ్రైవర్ సైదులును అప్రమత్తం చేసింది. 108 కాల్ చేయడంతోపాటు బస్సును పక్కకు ఆపి మురళీకృష్ణకు సీపీఆర్ చేశారు. తర్వాత అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుడిని కాపాడిన కండెక్టర్, డ్రైవర్ను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అభినందించారు.
