భారీగా పతనమైన వెండి ధర.. స్వల్పంగా తగ్గిన పసిడి ధర..

భారీగా పతనమైన వెండి ధర.. స్వల్పంగా తగ్గిన పసిడి ధర..

దేశంలో బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ.150 తగ్గి రూ. 54,950కి చేరింది. గురువారం ఈ ధర రూ. 55,100గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,495గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 160 తగ్గి.. రూ. 59,950కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 60,110గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 5,995గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,100గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,950 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​59,950గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 54,950గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,950గా నమోదైంది.  చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,350గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,380గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 54,950గాను 24 క్యారెట్ల పసిడి రూ. 59,950గాను ఉంది. ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

భారీగా తగ్గిన వెండి ధరలు 
దేశంలో వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. కేజీ వెండి రూ. 2300 తగ్గి.. రూ. 75,000కి చేరింది. గురువారం ఈ ధర రూ. 77,300గా ఉంది. ప్రస్తుతం100 గ్రాముల వెండి ధర రూ. 7,500గా ఉంది.  హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 78,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 75,000.. బెంగళూరులో రూ. 76,000గా ఉంది.