
రూ. 200, 500 నోట్లను కలర్ జిరాక్స్ తీసిన్రు
మంచిర్యాలలో ఇద్దరి అరెస్ట్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో శనివారం దొంగ నోట్లు చలామణి చేస్తూ దొరికిన రాజేందర్ వాటిని కలర్ జిరాక్స్ తీసినట్లు పోలీసులు తేల్చారు. డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బోయిని రాజేందర్(30) మంచిర్యాల మార్కెట్లో శీపతి కుమార్ అనే వ్యాపారి దగ్గర రూ.40 కూరగాయలు కొనుగోలు చేసి రూ.500 నోటు ఇచ్చాడు. అతడి వద్ద చిల్లర లేకపోవడంతో పక్కన ఉన్న మరో వ్యాపారికి ఇచ్చి చిల్లర అడిగాడు. ఆ నోటు మందంగా ఉండడంతో అనుమానం వచ్చి మరొక నోటు ఇవ్వమన్నాడు. రెండు నోట్లపై సీరియల్నంబర్ఒకటే ఉండడంతో రాజేందర్ను నిలదీయడంతో గొడవకు దిగాడు. వ్యాపారులంతా ఏకమై అతడిని స్తంభానికి కట్టేసి కొట్టి, పోలీసులకు అప్పగించారు. కుమార్ కంప్లైంట్ మేరకు పోలీసులు రాజేందర్పై కేసు ఫైల్చేసి ఎంక్వైరీ చేపట్టారు.
రూ. 1.62 లక్షలు జిరాక్స్ తీసిన్రు
జైపూర్మండలం మద్దులపల్లికి చెందిన అట్ల మల్లేష్(39) కొన్నేళ్ల క్రితం మందమర్రిలో నివాసం ఉంటూ కరెన్సీ కలర్ జిరాక్స్ చేసి చలామణి చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇద్దరి మధ్య మాటల క్రమంలో అతడు రాజేందర్కు విషయం చెప్పాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఇద్దరూ కలిసి నకిలీ కరెన్సీ చలామణి చేయాలనుకున్నారు. రాజేందర్గ్రామంలో కలర్ జిరాక్స్ నడిపించే తన బావ బొలిశెట్టి లచ్చన్న దగ్గర జిరాక్స్మిషన్ను రోజుకు రూ.వెయ్యికి రెంట్కు తీసుకున్నాడు. మంచిర్యాలలో పేపర్లు కొన్నారు. ఈ నెల 6న పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారంలోని తన బంధువుల ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కడ రూ.500, 200 నోట్లను జిరాక్స్తీశారు. మల్లేష్ రూ.56 వేలు, రాజేందర్ రూ.1.06 లక్షలు వారి దగ్గర పెట్టుకున్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో గోదావరిఖని నుంచి మంచిర్యాల మధ్య తిరుగుతూ చిన్నచిన్న షాపులు, కూరగాయల వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారు. వారి వద్ద తక్కువ మొత్తంలో వస్తువులను కొని నకిలీ నోట్లను ఇచ్చి వచ్చిన చిల్లర డబ్బులు జమ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే రాజేందర్ మంచిర్యాలలో పట్టుబడ్డాడు. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.
For More News..