బి.వెంకట్​కు ఉత్తమ కవి అవార్డు

బి.వెంకట్​కు ఉత్తమ కవి అవార్డు

నిర్మల్, వెలుగు: నిర్మల్​కు చెందిన ప్రముఖ కవి, తెలంగాణ రచయితల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి, సంస్కృత భాషా ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బి.వెంకట్​కు ఉత్తమ కవి అవార్డు దక్కింది. ఆంధ్రప్రదేశ్ లోని  ఏలూరులో అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ  శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన 134వ అంతర్జాతీయ శతాధిక పద్య కవుల సమ్మేళనంలో భాగంగా సీస పద్య వైభవం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకట్​ను ఉత్తమ కవి అవార్డుతో సన్మానించారు. 

ఈ సభలో సంస్థ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, కొల్లి రమావతి, చిట్టెం లలిత, శ్రీహరి, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ కవికి అవార్డు దక్కడంతో పలువురు ఆయనను అభినందించారు.