రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తనందించింది. 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్ పంటలకు 50 శాతం నుంచి 83 శాతం వరకు పెంచుతూకేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో సోమవారం కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో 14 పంటల కనీస మద్దతు ధర పెంపుకు ఆమోదం తెలిపింది. కేబినెట్ ముగిసిన తర్వాత ఈ వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాకు వెల్లడించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు రిలీఫ్ కలిగించేందుకు రుణాలను చెల్లించేందుకు ఆగస్టు వరకు సమయం పెంచుతూ కేబినెట్ తీర్మానం చేసినట్లు తెలిపారు. అలాగే రైతలుకు అండగా ఉండేలా ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 14 పంటలకు మద్దతు ధరను 50 నుంచి 83 శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వరి ధాన్యం క్వింటాల్ కు మద్దతు ధరను రూ.1868కి పెంచామని, జొన్నలకు క్వింటాల్ రూ.2620 చేశామని చెప్పారు.
పంటల వారీగా పెరిగిన మద్దతు ధరల వివరాలివీ:
పంట పెంపు క్వింటాల్ ధర
వరి (సాధారణ రకం) రూ.53 రూ.1,868
జొన్న (హైబ్రిడ్) రూ.70 రూ.2,620
సజ్జలు రూ.150 రూ.2,150
రాగులు రూ.145 రూ.3,295
మొక్క జొన్న రూ.90 రూ.1,850
కందులు రూ.200 రూ.6,000
పెసలు రూ.146 రూ.7,196
మునుములు రూ.300 రూ.6,000
పల్లీ రూ.185 రూ.5,275
పొద్దుతిరుగుడు గింజలు రూ.235 రూ.5,885
సోయాబీన్ రూ.170 రూ.3,880
నువ్వులు రూ.370 రూ.6,855
నైగర్ సీడ్స్(వెర్రి నువ్వులు) రూ.755 రూ.6,695
పత్తి (మీడియం స్టాపుల్) రూ.260 రూ.5,515
పత్తి (లాంగ్ స్టాపుల్) రూ.275 రూ.5,825
MSP rate for Paddy now at Rs 1868 per quintal, Jowar-Rs 2620/quintal, Bajra-Rs 2150/quintal, and 50% increase in Ragi, Moong, Groundnut, Soyabean, Til and Cotton, for the year 2020-21: Union Minister Narendra Tomar pic.twitter.com/9kcXSb0EVN
— ANI (@ANI) June 1, 2020