తెలంగాణ లాక్ డౌన్ పై రేపు కేబినెట్ నిర్ణయం

తెలంగాణ లాక్ డౌన్ పై రేపు కేబినెట్ నిర్ణయం
  • మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం

హైదరాబాద్: రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో లాక్ డౌన్  విధింపు పై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు  క్యాబినెట్ సమావేశం జరగనున్నది.  దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినా కూడా కరోనా అంతగా తగ్గుతలేదని, సరియైన ఫలితాలు లేవని రిపోర్టులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ విధింపు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని వర్గాలు లాక్ డౌన్  కావాలని కోరుకుంటున్నపరిస్థితి కూడా వున్నది. ఈ పరిస్థితుల్లో.. లాక్ డౌన్ విధించడం వల్ల కలిగే సాదక బాదకాలతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోల్ల ప్రక్రియ మీద లాక్ డౌన్ ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశం పై క్యాబినెట్  చర్చించి  నిర్ణయం తీసుకోనే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.