
తెలంగాణ కేబినెట్ సమావేశం ఆగస్టు 29న మద్యాహ్నం 3:30గంటలకు జరగనుంది. సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. బీసీ రిజర్వేషన్లు, అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు, సర్పంచ్ ఎన్నికలు,కాళేశ్వరం నివేదికపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించనున్నారు.
ముఖ్యంగా అందరు ఎదురు చూస్తోన్న పంచాయతీ ఎన్నికల నిర్వాహణపై ఈ కేబినెట్ భేటీలో క్లారిటీ రానుంది. సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలపై స్పష్టత కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు, పంచాయతీ రాజ్చట్ట సవరణ ఆర్డినెన్స్కేంద్రం వద్ద పెండింగ్లో ఉండటంతో రిజర్వేషన్లపై ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా తీసుకుంది సబ్ కమిటీ. ఆగస్టు 28 లోపు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది . సబ్ కమిటీ ఇచ్చే నివేదికపై కేబినెట్ లో చర్చించి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం .
మరో వైపు కాళేశ్వరం అవకతవకలపై ఏర్పాటు చేసిన జిస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై అసెంబ్లీలో చర్చిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల తేది ఖరారు చేయనుంది కేబినెట్ భేటీ.