- ప్రవేశపెట్టనున్న కేంద్రం.. ధరల ప్రస్తావన లేకుండానే నివేదిక?
న్యూఢిల్లీ: పొలిటికల్ ఫైటింగ్కు కేంద్ర బిందువుగా మారిన రాఫెల్ డీల్ పై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) సిద్ధం చేసిన రిపోర్టును కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనునుంది. అధికారికంగా ‘క్యాపిటల్ అక్విజిషన్స్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్’గా పిలిచే ఈ రిపోర్టును బడ్జెట్ సమావేశాలు ముగియడానికి ఒక్క రోజు ముందు సభ ముందుకు తెస్తుండటం గమనార్హం. ఫిబ్రవరి 13న(బుధవారం) జరగే సమావేశమే16వ లోక్సభకు చివరిది. కాబట్టి కాగ్ రిపోర్టుపై పార్లమెంట్ లో సుదీర్ఘ చర్చ కష్టమే. పైగా రిపోర్టుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తొలి నుంచే అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. ప్రస్తుత కాగ్ రాజీవ్ మహర్షి గతంలో ఫైనాన్స్ సెక్రటరీగా
పనిచేసిన కాలంలోనే రాఫెల్ ఒప్పందం కుదిరిందని, ఆయన ఆమోదిం చిన ఒప్పందంలో మళ్లీ
ఆయనే తప్పులు గుర్తిస్తారన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీకి లేదని ఎంపీ కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు. నేడు విడుదల కానున్న కాగ్ రిపోర్టులో రాఫెల్ ధరల ప్రస్తావన ఉండకపోవచ్చని పార్లమెంట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.