క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సింధు, లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సింధు, లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కల్గరీ: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌.. కెనడా ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–500 టోర్నీలో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సింధుకు వాకోవర్‌‌‌‌‌‌‌‌ విజయం లభించింది. ఆమె ప్రత్యర్థి నట్సుకి నిడైరా (జపాన్‌‌‌‌‌‌‌‌) మ్యాచ్‌‌‌‌‌‌‌‌ నుంచి వైదొలిగింది. 

మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌ 21–15, 21–11తో క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌ యోగోర్ కోయెల్హో (బ్రెజిల్‌‌‌‌‌‌‌‌)పై గెలిచాడు. 31 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో లక్ష్య ర్యాలీలు, స్మాష్‌‌‌‌‌‌‌‌లతో ఆకట్టుకున్నాడు. 0–2తో తొలి గేమ్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టిన లక్ష్య స్కోరు 13–13 వద్ద తేరుకున్నాడు. ఇక్కడి నుంచి వరుస పాయింట్లతో హోరెత్తించాడు. 

రెండో గేమ్‌‌‌‌‌‌‌‌లో లక్ష్య పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. 12–0తో వెనుదిరిగి చూసుకోలేదు. మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో కృష్ణ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ గార్గ్‌‌‌‌‌‌‌‌–విష్ణువర్ధన్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ 9–21, 11–21తో మహ్మద్‌‌‌‌‌‌‌‌ అహసాన్‌‌‌‌‌‌‌‌–హెండ్రా సితివాన్‌‌‌‌‌‌‌‌ (ఇండోనేసియా) చేతిలో ఓడారు.