ఆర్మూర్, వెలుగు : బంగ్లాదేశ్లో దీపు హత్యను తీవ్రంగా ఖండిస్తూ హిందూ సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆలూర్ మండల కేంద్రంలో మంగళవారం కొవ్వత్తుల ర్యాలీ జరిపి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు అత్యంత బాధాకరమన్నారు.
మానవ హక్కులను కాలరాస్తూ జరిగిన హత్యను అంతర్జాతీయ సమాజం గట్టిగా వ్యతిరేకించాలని కోరారు. హిందువులపై జరుగుతున్న దాడులను ఆపాలని డిమాండ్ చేశారు.
