శబరిమలకు ఎక్కువ మందిని అనుమతించలేము

శబరిమలకు ఎక్కువ మందిని అనుమతించలేము

శబరిమలలో భక్తుల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుంభనెల సందర్భంగా ఎక్కువ మందిని అనుమతించాలని ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం చేసిన విజ్ఞప్తి ప్రభుత్వం తిరస్కరించింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే 5వేల మంది భక్తులను అనుమతించామని… అంతకంటే ఎక్కువ మందిని అనుమతించడం వీలుకాదని స్పష్టం చేసింది.

కుంభనెల క్రమంలో ఈ నెల 12న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోనుంది. ఈ సందర్భంగా 15వేల మంది భక్తులకు అవకాశం కల్పించాలని కోరుతూ.. ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా తీవ్రతను అంచనా వేసి.. నిర్ణయాన్ని ప్రకటించాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఆలయంలోకి ఎక్కువ మంది భక్తులను అనుమతిస్తే వైరస్‌ తీవ్ర పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం… దేవస్థానం బోర్డు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది.