- కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
పద్మారావునగర్, వెలుగు: నర్సు వృత్తి తల్లి చేసే సేవతో సమానమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. మారేడ్పల్లిలోని ఈశ్వరీ బాయి మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో శుక్రవారం జరిగిన ఫేర్వెల్ అండ్ ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఆయన గెస్టుగా హాజరయ్యారు. విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు, అకడమిక్ సర్టిఫికెట్లు అందజేశారు.
