రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్ గుడా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్గు రోడ్డు సర్వీస్ రోడ్డు పై సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు టాటా సఫారీ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదం సమయంలో వాహనంలో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని సమీప హాస్పిటల్ కి తరలించారు. అయితే టాటా సఫారీలో మద్యం బాటిల్స్ లభ్యంకావడంతో.. ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.