హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం : ముగ్గురు స్టూడెంట్స్ స్పాట్ డెడ్

హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం : ముగ్గురు స్టూడెంట్స్ స్పాట్ డెడ్

హైదరాబాద్ శివారు ప్రాంతం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖానాపూర్ చౌరస్తా వద్ద బస్సును ఓవర్టేక్ చేయబోయిన ఓ కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..ఏడుగురికి తీవ్ర గాయాలైయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

శంకర్ పల్లి నుండి గండిపేట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన కారులో మొత్తం 10 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వేగంగా లారీని ఢీ కొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి అతివేగమే అని పోలుసులు ప్రథమిక విచారణలో తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.