హైదరాబాద్ వనస్థలిపురంలో కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు చనిపోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వీరందరూ TS05FH2356 నెంబరు గల కారులో ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు బీయన్ రెడ్డి నగర్ వద్దకు చేరుకోగానే అదుపుతప్పి ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టి, రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇబ్రహీంపట్నానికి చెందిన సందీప్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఘటనాస్థలంలోనే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. కారు నడిపిన గౌతమ్ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మల్లికార్జున్ అనే మరో యువకుడు ఆక్సిడెంట్ కాగానే భయపడి.. అక్కడి నుంచి పరారయ్యాడు. మల్లికార్జున్ ఆక్టోపస్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. మద్యం మత్తులో కారును ఓవర్ స్పీడ్తో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గౌతమ్ పై 304 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం తెలిపారు.
మద్యం మత్తులో ట్రాఫిల్ సిగ్నల్ను ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి
- హైదరాబాద్
- February 27, 2021
లేటెస్ట్
- ప్రచారానికి డబ్బుల్లేవని పార్టీ టికెట్ తిరిగిచ్చేసింది
- మిస్టరీ : ఈ ట్రైన్ ఏనాటిది?
- హైదరాబాద్ను యూటీ చేసేందుకు బీజేపీ కుట్ర : ఆనంద భాస్కర్
- బుర్ఖాల్లో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నరు : జనాబ్ జమాల్ సిద్ధిఖీ
- పరిచయం : అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నటిగా
- ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ
- ప్రాంతీయ పార్టీల లీడరే ప్రధాని అయితడు
- అమిత్ షా ఫేక్ వీడియో కేసు .. పోలీస్ కస్టడీకి అరుణ్ రెడ్డి
- బెయిల్ మీదున్నోళ్లు దేశాన్ని ఉద్ధరిస్తరా?
- వడదెబ్బతో తెలంగాణలో ఆరుగురు మృతి
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్