మహిళకు తీవ్ర గాయాలు
హైదరాబాద్, వెలుగు : ఫిల్మ్ నగర్లో కారు బీభత్సం చేసింది. డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. మద్యం మత్తులో గురువారం
సాయంత్రం జరిగిన యాక్సిడెంట్ లో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన ప్రకారం.. మారుతి
కారులో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ మీదుగా షేక్పేట్ వైపు వెళ్తున్న ఇద్దరు యువకులు ఓవర్ స్పీడ్ తో డివైడర్ను ఢీకొట్టారు. కారు పల్టీలు కొడుతూ రోడ్డుకు అవతలి వైపు ఎగిరి పడింది. రోడ్ క్రాస్ చేస్తున్న మహిళను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయ పడ్డఆమెను పోలీసులు హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.