చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి

చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి

భోపాల్‌ (మధ్యప్రదేశ్‌): మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా, బుధవారం తెల్లవారుజామున హార్దా జిల్లాలో వారి కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది.

దీంతో కారులో మంటలు చెలరేగి ఓ మహిళతో పాటు ముగ్గురు పురుషులు సజీవ దహనం అయ్యారు. వీరిలో ఆరు నెలల క్రితం పెళ్లి అయిన జంట కూడా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే వారు మృతి చెందారు. ఫైర్‌‌ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.