తిరుమలలో కారులో ఒక్కసారిగా మంటలు... పరుగులు తీసిన భక్తులు..

తిరుమలలో కారులో ఒక్కసారిగా మంటలు... పరుగులు తీసిన భక్తులు..

తిరుమల కొండపై ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ( జూన్ 29 ) తిరుపతి నుంచి తిరుమల వెళ్లిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కర్ణాటక నుంచి వచ్చిన భక్తులకు ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తిరుపతి నుంచి తిరుమల వెళ్లిన కారు జీఎన్సీ టోల్ గేట్ దగ్గరికి చేరుకోగానే ఒక్కసారిగా కారులో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు కారు దిగి పరుగులు తీసారు.

►ALSO READ | పాము కాటుకు గురైన తిరుమల స్నేక్ క్యాచర్ భాస్కర్.. ఆందోళనలో టీటీడీ అధికారులు..

మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో భయబ్రాంతులకు గురయ్యారు భక్తులు. ఘటనాస్థలికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు  మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.