ఇంటి ముందు నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు.. యువకుడు మృతి

ఇంటి ముందు నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు.. యువకుడు మృతి

ఇంటి ముందు నిద్రిస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ఒక యువకుడు మృతిచెందాడు. బెల్లంపల్లి పట్టణం సుభాష్ నగర్‌‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న ఓ కుటుంబం శనివారం రాత్రి తమ ఇంటి ముందు పడుకున్నారు. అటుగా వచ్చిన ఓ కారు.. వారి మీది నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 18 సంవత్సరాల యువకుడు మృతి చెందగా.. అతని తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారుతో సహా డ్రైవర్ పరారయ్యాడు. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం గాలిస్తున్నారు.