
గోదావరిఖని, వెలుగు: అద్దె పేరిట కార్లను తీసుకెళ్లి కుదువపెట్టి డబ్బులు తెచ్చుకుని జల్సాలు చేస్తున్న వ్యక్తిని పెద్దపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్తెలిపిన ప్రకారం.. గోదావరిఖనిలోని ఎల్బి నగర్కు చెందిన మారపెల్లి ప్రణయ్భాస్కర్ కారు డ్రైవర్. కాగా.. కార్లకు అద్దె ఇప్పిస్తానని నమ్మించడంతో ఎల్బీనగర్కు చెందిన బోడ తిరుపతి తన కారు ఇచ్చాడు. కొన్ని నెలలు కిరాయి ఇచ్చి అనంతరం మానేశాడు.
కారు అద్దె గురించి అడిగితే బెదిరించడంతో తిరుపతి గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో గత నెలలో కంప్లయింట్ చేశాడు. వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరో నలుగురి కార్లను కూడా తీసుకెళ్లి కుదువపెట్టి రూ.10 లక్షలు తీసుకున్నట్టు తేలింది. ఇదే కేసుకు సంబంధించిన ఎల్ బీనగర్ కు చెందిన జూపాక పుప్పలత, సప్తగిరి కాలనీకి చెందిన వనం శ్రీనివాస్కు పోలీసులు విచారణకు రావాలని నోటీసులు జారీచేశారు. వన్టౌన్ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది ఉన్నారు.