కర్నూలులో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

కర్నూలులో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

ఆంధ్ర ప్రదేశ్: కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. శుక్రవారం కడపజిల్లా ప్రొద్దుటూరులో ఎంగేజ్ మెంట్ చేసుకుని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న అమ్మాయి తరపు వారు హైదరాబాద్ కు  తిరిగి వస్తుండగా కర్నూలు  జిల్లా ఓర్వకల్లు వద్ద  ప్రమాదం జరిగింది. అయితే నందికొట్కూర్ నుండి మద్దిలేటి కి వెళ్తున్న ట్రాక్టర్ ను పెళ్లివారు ప్రయాణిస్తున్న కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లికూతురు కూడా ప్రమాదం జరిగిన కారులోనే ఉందని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను పోలీసులు కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.