రాజేంద్రనగర్‌లో కారు బీభత్సం

రాజేంద్రనగర్‌లో కారు బీభత్సం

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గురువారం ఉదయం కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కారు, కంట్రల్ తప్పి రాజేంద్రనగర్ బస్ డిపో ఎదురుగా డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నఇద్దరికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. సంక్రాంతి పండుగ కావడంతో రోడ్డు మీద జనాలు తక్కువగా ఉన్నారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

For More News..

ఎన్ఆర్సీపై తెలంగాణ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

బాత్రూంలో ఉన్న ఫొటోలతో మాజీ మిస్ ఇండియాకు వేధింపులు