- నలుగురికి గాయాలు.. డ్రైవర్ పరారీ
పద్మారావునగర్, వెలుగు: బేగంపేట ఫ్లైఓవర్పై బుధవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్స్పీడ్తో డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. కారును డ్రైవ్ చేసిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. రోడ్డుకు అడ్డంగా కారు బోల్తా పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో కారును పక్కకు తీసి, ట్రాఫిక్ను పోలీసులు క్లియర్ చేశారు.
