మార్నింగ్ వాకర్స్పై దూసుకెళ్లిన కారు..ముగ్గురు మృతి

మార్నింగ్ వాకర్స్పై దూసుకెళ్లిన కారు..ముగ్గురు మృతి

హైదరాబాద్ బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో ఓ కారు మార్నింగ్ వాకర్స్ పై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు , ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అనురాధ(38), మమత(26)గా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కారులో మారణాయుధాలను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.