వెంకటాపురం వెలుగు: ఏటీఎం నుంచి మనీ తీసిపెట్టమని కోరిన వృద్ధుడి వద్ద ఓ అపరిచత వ్యక్తి కార్టు కొట్టేసి వేర్వేరు చోట్ల డబ్బులు డ్రాచేశాడు. ఈ సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై జి.తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ వీధికి చెందిన కొయ్యల లాలయ్య హెల్త్ డిపార్ట్మెంట్లో చేసి 2009లో రిటైర్అయ్యారు. ప్రతినెలా అతనికి రూ.40 వేలు పెన్షన్ వస్తుంది. ఏప్రిల్20వ తేదీన డబ్బులు తీసేందుకు స్థానిక ఎస్ బీఐ ఏటీఎంకు వెళ్లారు. కంటి చూపు సరిగా లేకపోవడంతో అక్కడికి వచ్చిన ఓ యువకుడిని సాయమడిగాడు. అదే అదనుగా భావించిన యువకుడు వృద్ధుడికి డబ్బులు ఎలా తీయాలో చెబుతూ.. అతని వద్ద ఉన్న కార్డును(కాటమరాయుడు అనే పేరుతో) లాలయ్యకు ఇచ్చాడు.
పిన్నంబర్ కార్డుతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మే 4న డబ్బుల కోసం లాలయ్య బ్యాంక్కు వెళ్లగా అకౌంట్లో డబ్బులు లేవని తెలిసింది. ఎంక్వైరీ చేయగా ఏటూరునాగారం, వరంగల్, మణుగూరు, పాల్వంచ, ఖమ్మం ప్రాంతాల్లోని ఏటీఎంల నుంచి డబ్బులు తీసినట్లు తెలిసింది. లాలయ్య తన దగ్గర ఉన్న కార్డు చెక్చేసుకోగా అది అతనిది కాదని తెలిసింది. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి ఫొటోను పోలీసులు గురువారం మీడియాకు రిలీజ్ చేశారు. అతని వివరాలు తెలిస్తే పీఎస్ నంబర్లు 94407 95394, 99632 55931కి చెప్పాలన్నరు.