చైనా నుంచి కోల్ కతాకు కార్గో షిప్

చైనా నుంచి కోల్ కతాకు కార్గో షిప్

కరోనా వైరస్‌ భయాందోళనల క్రమంలో చైనా నుంచి బయల్దేరిన ఓ కార్గో నౌక ఇవాళ(గురువారం) కోల్ కతాకు చేరుకోనుంది. జనవరి 29న 19 మంది చైనీస్ క్రూ సభ్యులతో షాంఘై నుంచి ఈ నౌక బయల్దేరింది. కోల్ కతాకు 120 కిలోమీటర్ల దూరంలో సాగర్ ఐలాండ దగ్గర నిన్న(బుధవారం) ఈ నౌకను కోల్ కతా పోర్టు అధికారులు ఆపేశారు. వెంటనే ఓ వైద్య బృందాన్ని నౌకలోకి పంపించారు. నౌకలోని క్రూ సిబ్బందికి డాక్టర్లు కరోనా టెస్టులను నిర్వహించారు. వీరిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేకపోవడంతో… పోర్టులోకి వచ్చేందుకు అధికారులు నౌకకు అనుమతిని ఇచ్చారు. ఈ సాయంత్రం 5.30 గంటలకు కోల్ కత్తా పోర్టుకు కార్గో షిప్ చేరుకోనుంది. పోర్టుకు చేరుకున్న వెంటనే క్రూ సిబ్బందికి పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మరోసారి వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. మరో వైపు, షాంఘై నుంచి ఈ నౌక బయల్దేరినప్పటి నుంచి ఎప్పటికప్పుడు క్రూ మెంబర్ల శరీర ఉష్ణోగ్రతల వివరాలను కోల్ కతా వైద్యాధికారులకు షిప్ కెప్టెన్ పంపిస్తూనే ఉన్నారు.