అంజు నస్రుల్లాపై రాజస్థాన్​లో కేసు

అంజు నస్రుల్లాపై రాజస్థాన్​లో కేసు

జైపూర్: ఫేస్ బుక్ ప్రియుడి కోసం పాకిస్తాన్ వెళ్లి, మతం మారి పెళ్లి చేసుకున్న వివాహిత అంజుపై, ఆమె రెండో భర్త నస్రుల్లాపై రాజస్థాన్ లో కేసు నమోదైంది. వారిపై అల్వార్​ జిల్లాలో ఎఫ్​ఐఆర్​ నమోదైందని పోలీసులు తెలిపారు. ఐపీసీ 366, 494, 500, 506 సెక్షన్లతోపాటు, ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు భివాడీ డీఎస్పీ తెలిపారు. 

ఈ సందర్భంగా అంజు మొదటి భర్త అరవింద్ ​కుమార్ ​మాట్లాడుతూ.. విడాకులు తీసుకోకుండా అంజు చేసుకున్న రెండో పెండ్లి చెల్లదన్నారు. అంజు పాస్​పోర్ట్​, వీసాలపై దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ​కోరారు. మరోవైపు, పాకిస్తాన్ అప్పర్​ డిర్​జిల్లాకు చెందిన పోలీస్​ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. అంజు ఇస్లాంలోకి మారిన తరువాత ​నస్రుల్లాను చట్టబద్ధంగా పెండ్లిచేసుకుందని చెబుతున్నారు.