జైపూర్: ఫేస్ బుక్ ప్రియుడి కోసం పాకిస్తాన్ వెళ్లి, మతం మారి పెళ్లి చేసుకున్న వివాహిత అంజుపై, ఆమె రెండో భర్త నస్రుల్లాపై రాజస్థాన్ లో కేసు నమోదైంది. వారిపై అల్వార్ జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదైందని పోలీసులు తెలిపారు. ఐపీసీ 366, 494, 500, 506 సెక్షన్లతోపాటు, ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు భివాడీ డీఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా అంజు మొదటి భర్త అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. విడాకులు తీసుకోకుండా అంజు చేసుకున్న రెండో పెండ్లి చెల్లదన్నారు. అంజు పాస్పోర్ట్, వీసాలపై దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు, పాకిస్తాన్ అప్పర్ డిర్జిల్లాకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. అంజు ఇస్లాంలోకి మారిన తరువాత నస్రుల్లాను చట్టబద్ధంగా పెండ్లిచేసుకుందని చెబుతున్నారు.