- ఎల్బీనగర్లో ముదురుతున్న ప్రొటోకాల్ వివాదం
ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్ సెగ్మెంట్లో బీఆర్ఎస్, బీజేపీ లీడర్ల మధ్య ప్రొటోకాల్ వివాదం ముదురుతోంది. ఇటీవల అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన బీఆర్ఎస్ లీడర్లపై బీజేపీ లీడర్లు ఫిర్యాదు చేయగా వనస్థలిపురం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. జడ్జెస్ కాలనీ రోడ్ నం.7లోని ఓ పార్కులో 2017లో షటిల్కోర్టు ఏర్పాటుకు నిధులు మంజూరు కాగా అప్పటి టీఆర్ఎస్ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి పేరుతో శిలాఫలకం వేసి పనులు ప్రారంభించారు.
కాంపౌండ్ వాల్ నిర్మించి కొంత అభివృద్ధి చేశారు. బల్దియా నిధులతో ప్రస్తుత బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి మరింత అభివృద్ధి చేసి ఇటీవల మరో శిలాఫలకం వేశారు. ఇది కాస్తా వివాదస్పదమైంది. శిలాఫలకంలో స్థానిక ఎమ్మెల్యే పేరు లేకపోవడంతో బీఆర్ఎస్ లీడర్లు ధ్వంసం చేశారని, కార్పొరేటర్ నర్సింహను దూషించారని ఆరోపిస్తూ బీజేపీ లీడర్శ్రీధర్ గౌడ్ బుధవారం వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీపీ ఫుటేజీలను పోలీసులకు చూపించాడు.