బీఆర్ఎస్ ​ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నయ్యపై కేసు

బీఆర్ఎస్ ​ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నయ్యపై కేసు

బెల్లంపల్లి రూరల్, వెలుగు : పార్టీ కండువాతో పోలింగ్ ​కేంద్రానికి వెళ్లిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్​ అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేసినట్లు నెన్నెల ఎస్సై శ్యాం పటేల్ ​తెలిపారు. చిన్నయ్య గురువారం తన సొంత గ్రామమైన జెండావెంకటాపూర్​లో బీఆర్ఎస్​ పార్టీ కండువా వేసుకొని పోలింగ్​కేంద్రంలోకి వెళ్లి ఓటు వేశారు.

దీంతో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ నాయకులు డిమాండ్​ చేశారు. స్పందించిన ప్రిసైడింగ్​ఆఫీసర్​ ఒజ్జల రాజశేఖర్ నెన్నెల పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.