ఐసిస్ కే ఉగ్రవాదులపై మారేడ్​పల్లిలో కేసు

ఐసిస్ కే ఉగ్రవాదులపై మారేడ్​పల్లిలో కేసు
  •  న్యాయవాది రామారావు ఫిర్యాదు మేరకు నమోదు  

కంటోన్మెంట్, వెలుగు: ఇస్లామిక్ స్టేట్​ఉగ్రవాద అనుబంధ సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్(ఐసిస్ కే)కు చెందిన పలువురిపై మారేడ్​పల్లి పోలీసులు దేశద్రోహం, తీవ్రవాద చర్యల కింద కేసు నమోదు చేశారు. ఈ సంస్థ ప్రతినిధులు కొంత కాలంగా వెబ్​సైట్​ద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు.

 మారేడ్​పల్లికి చెందిన సీనియర్ న్యాయవాది రామారావు ఇమ్మానేని దీన్ని గుర్తించి సైబర్​క్రైమ్ ​పోలీసులతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. అలాగే హైకోర్టులో రిట్​పిటిషన్​ దాఖలు​ చేయడంతో మారేడుపల్లి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఐసిస్​కే సంస్థకు చెందిన ఇఫ్తికార్ ఫిర్దోస్, ఇహసానుల్ల టిప్పు మెహసూద్, రిచర్డ్స్​వల్లె, ఫకర్ కక్కేల్, నవాబ్ అలీ కటక్, కిరణ్ భట్  తదితరులపై పలు సెక్షన్లపై పోలీసులు ఎఫ్​ఐఆర్​నమోదు చేశారు. ఉగ్రవాదులకు సంబంధించిన ఇష్యూ కావడంతో  కేసును ఢిల్లీకి బదిలీ చేయనున్నట్లు సమాచారం.