మోసం చేశాడని యువతి కంప్లైంట్.. ఎస్సై సస్పెండ్

మోసం చేశాడని యువతి కంప్లైంట్.. ఎస్సై సస్పెండ్

మల్కాజ్గిరి సీసీఎస్ ఎస్సై విజయ్ ధరావత్ను సస్పెండ్ అయ్యారు. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ లో చేసిన  ఫిర్యాదుతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. యువతి ఫిర్యాదుపై విచారణ అనంతరం విజయ్ పై ఐపీఎస్ సెక్షన్ 376(2) (n),417,420 కింద కేసు నమోదుచేశారు. బాధితురాలితో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపిన ఎస్సై విజయ్.. అనంతరం మరొకరిని వివాహం చేసుకున్నాడు. ఆ విషయం తెలిసి నిలదీయడంతో తనతో సహజీవనం చేయాలని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. 

యువతి ఫిర్యాదుపై కేసు నమోదుకావడంతో ఎస్సై విజయ్ వ్యవహారంపై విచారణ జరపాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశించారు. సమగ్ర నివేదిక సమర్పించాలని రాచమల్కాజ్గిరి ఏసీపీని ఆదేశించారు. తాజాగా ఏసీపీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సీపీ మహేశ్ భగవత్ ఎస్సై విజయ్ ను సస్పెండ్ చేశారు.