హైదరాబాద్ సిటీ, వెలుగు: టాలీవుడ్ హీరో ధర్మ మహేశ్భార్య గౌతమి చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సోమవారం బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషా ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా శేఖర్బాషా మాట్లాడారు. హీరో ధర్మ మహేశ్కు సపోర్ట్ గా మాట్లాడటంతోనే గౌతమి తనను టార్గెట్ చేస్తోందని తెలిపారు.
బిహార్ నుంచి రౌడీలను పంపించి తనను చంపిస్తానని బెదిరిస్తోందని ఆరోపించారు. తన తల్లి, కూతురుపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని చెప్పారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో గౌతమిపై బీఎన్ఎస్351(3), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
