నటుడు నరేష్ భార్యపై కేసు నమోదు

నటుడు నరేష్ భార్యపై కేసు నమోదు

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ భార్య రమ్య రఘుపతిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ కొందరు మహిళలు ఫిర్యాదు చేశారు. రమ్య రఘుపతి దాదాపు రూ.50 లక్షల రూపాయలు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి సీఐ సురేష్ మాట్లాడుతూ..2019 సంవత్సరంలో కొంత మంది మధ్యవర్తుల ద్వారా అగ్రిమెంట్ చేసుకుని రమ్య రఘుపతి ఐదుగురి దగ్గర డబ్బులు తీసుకున్నారు.  ఇందులో కొంతమేర చెల్లించి మిగతా డబ్బులకు చెక్కులు ఇచ్చారు . ఈ చెక్కులు బౌన్స్ కావడంతో 3 రోజుల క్రితం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం’ అని అన్నారు. మరో వైపు రమ్య రఘుపతి చేసిన మోసాలకు, అప్పులకు తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చాడు నటుడు నరేష్. మనస్పర్దలతో ఐదారేళ్లుగా  తాము విడిగా ఉంటున్నామన్నారు.

For More News..

కేసీఆర్ రాజ్యాంగాన్నే తిరగరాస్తానంటూ బరితెగించిండు

కేసీఆర్ కు ఉన్న బలమెంత? ఆయన అనుభవం ఎంత?