సీఎం ఆదేశం.. రైతులను మోసం చేసిన ముగ్గురు వ్యాపారులపై కేసు

సీఎం ఆదేశం.. రైతులను మోసం చేసిన ముగ్గురు వ్యాపారులపై కేసు

జనగామ వ్యవసాయ మార్కెట్ లో జరిగిన ఘటనపై సర్కార్ సీరియస్ అయ్యింది. రైతుల్ని దోచిన వ్యాపారులపై పోలీసులు కేసులు పెట్టారు. కందుకూరి వెంకట్ నారాయణ, సుజాత, ఉషారాణిలపై కేసు నమోదు చేశారు. 

ఏప్రిల్ 10న  జనగామ మార్కెట్లో  దళారులు పంటను తక్కువ ధరకే కొంటున్నారంటూ రైతులు ఆందోళన చేశారు. నలుగురు ట్రేడర్లు, మార్కెట్ కార్యదర్శి సస్పెండ్ చేశారు అడిషనల్ కలెక్టర్. ఇటు ఇదే ఇష్యూపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. రైతులను మోసం చేసేందుకు ప్రయత్నించిన ట్రేడర్లపై కేసులు పెట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జనగామ పోలీసులు కేసులు నమోదు చేశారు.