
శివ్వంపేట, వెలుగు: శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 సంవత్సరాల బాలికకు వివాహం జరిపించారనే సమాచారంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ సంతోష, పంచాయతీ కార్యదర్శి గాయత్రి, బాలల సంరక్షణ కోఆర్డినేటర్ శంకర్ గౌడ్ సోమవారం గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు.
బాలిక తల్లిదండ్రులు, వివాహం చేసుకున్న పెళ్లికొడుకు, అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. బాలికను మెదక్ బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.