ఇబ్రహీంపట్నం : ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్పై దాడి ఘటనలో పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఎంపీ శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామానికి వెళ్లగా టీఆర్ఎస్కార్యకర్తలు కాన్వాయ్పై దాడికి పాల్పడ్డారు. దాడిలో పాల్గొన్న 14 మందిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో శనివారం 143, 147, 341, 427, 323, 504 r/w 149 IPC సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. కేసు నమోదైన వారిలో ఎర్ధండి ఉపసర్పంచ్శేఖర్, టీఆర్ఎస్లీడర్లు రాజశేఖర్, రాకేశ్, వరుణ్రాజ్, శంకర్, నాగరాజు, చక్రధర్, చిన్నరాజన్న, సుభాశ్, రాజు, ఆదర్శ్, నవీన్, భరత్, శివ ఉన్నారు. వీరిలో 10 మందిని శనివారం మెట్పల్లి మున్సిఫ్కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ పద్మావతి బెయిల్మంజూరు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
