హైదరాబాద్/కంటోన్మెంట్, వెలుగు: కులవృత్తులను టెక్నాలజీతో అప్గ్రేడ్ చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కంటోన్మెంట్మడ్ఫోర్డ్దోబీ ఘాట్ లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్వాషింగ్ మెషీన్ దోబీఘాట్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారు టెక్నాలజీని అందిపుచ్చునేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. ఏడాదిలోగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఎలక్ట్రికల్ వాషింగ్ మెషీన్ దోబీఘాట్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. వీటితోపాటు అన్ని రకాల వృత్తులను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ఆర్థిక సహకారం అందిస్తామని, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని చెప్పారు.
ఏ కులానికి ఎంత వాటా ఉండాలన్న అంశంపై సర్వే చేపట్టినట్లు తెలిపారు. సర్వే ఆధారంగా సబ్ప్లాన్, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్జిల్లా కలెక్టర్ అనుదీప్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి పొన్నం పూలమాలలు వేసి నివాళులర్పించారు. లబ్ధిదారులకు జీరో కరెంట్ కరెంట్బిల్లు, రూ.500లకు గ్యాస్ సిలిండర్ అందజేశారు. అలాగే బొల్లారంలో నిర్మించిన డైట్ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ను మంత్రి పొన్నం ప్రభాకర్మంగళవారం ప్రారంభించారు.
