ములుగు, వెలుగు : డీసీఎంల్లో పశువులను తరలిస్తుండగా ములుగు జిల్లా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. జంగాలపల్లి క్రాస్రోడ్డు వద్ద ఎస్ఐ సీహెచ్ వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2 డీసీఎంలు (36 టీ 4564, టీజీ12 టీ 2214 ) రాగా.. వాటిని ఆపి సోదాలు చేశారు. పర్మిషన్ లేకుండా పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. అందులోని 44 ఆవులు, ఎద్దులను స్వాధీనం చేసుకుని 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పశువులను గోశాలకు తరలించారు. అనుమతి లేకుండా తరలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
